అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ని కరోనా నీడలా వెంటాడుతుంది. నిన్న అమితాబ్ కు అభిషేక్ కు కరోనా రాగా నేడు ఐశ్వర్య రాయ్ కి ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది. కరోనా దెబ్బకు ఇప్పుడు వారి ఇంట్లో పని చేసిన వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా  ముంబై మున్సిపల్ శాఖ అధికారులు వారి నివాసాలకు సీల్ వేయడం సంచలనంగా మారింది. 

 

నటుడు అమితాబ్ బచ్చన్ కుటుంబానికి చెందిన జల్సా, ప్రతిక్ష, జనక్ మరియు వత్స నాలుగు బంగ్లాలను శానిటేషన్ చేసిన తరువాత సీలు చేశామని అధికారులు పేర్కొన్నారు. బంగ్లా లో పని చేస్తున్న మొత్తం 30 మందికి కరోనా పరిక్షలు చేసామని ఫలితాలు రావాల్సి ఉందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: