మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఉన్న అతిపెద్ద మురికివాడ ధారావీ లో కరోనా కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చేసాయి. తాజాగా ధారావీ లో కేవలం 5 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ముంబైలోని ధారావిలో ఈ రోజు ఐదు కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

 

ఈ ప్రాంతంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,375 కు చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా దాదర్‌లో 38 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. మహీమ్‌లో ఈ రోజు 10 కేసులు పెరిగాయని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి), వెల్లడించింది. ఇక ధారావీ లో పటిష్ట చర్యలు  చేపట్టడం తో కరోనా కేసులు దాదాపుగా అదుపులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: