తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1269 కేసులు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 34,671కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 22,482 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

 

గత 24 గంటల్లో రాష్ట్రంలో 8 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 356కు చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 800 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు వైరస్ భారీన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: