సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. భారత సైన్యం తన అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలను చేర్చుకోవడానికి సిద్ధమవుతోంది. అమెరికా నుంచి 72 వేల సిగ్​ సావర్​ అస్సాల్ట్​ రైఫిళ్లను దిగుమతి చేసుకొనే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

 

సరిహద్దుల్లో ఎదురవుతోన్న కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా భారత సైన్యాన్ని శక్తిమంతం చేయాలని 2017లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను అందించడానికి చర్యలు ప్రారంభించారు అధికారులు. 7 లక్షల రైఫిళ్లు, 44 వేల మెషీన్​ గన్​లు(తక్కువ బరువుతో కూడినవి), 44,600 కార్బైన్​ తుపాకులు సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచించారు.అయితే.. 2019కు ముందే సిగ్​ సావర్​ అస్సాల్ట్​ రైఫిళ్లను దిగుమతి చేసుకోవాలనుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ వాయిదాపడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: