మొన్న మధ్యప్రదేశ్ లో నమ్మకమైన యువనేత జ్యోతిరాదిత్య సింధియా గుడ్ బై. నేడు మరో నమ్మకమైన సమర్ధవంతమైన యువనేత సచిన్ పైలెట్ గుడ్ బై.  కాంగ్రెస్ కి భవిష్యత్తు అధ్యక్షులు అవుతారు అనుకున్న ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు కమలానికి జై కొట్టేసారు. సిందియా ఇప్పటికే మధ్యప్రదేశ్ లో బిజెపికి జై కొట్టిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజస్థాన్ లో కూల్చడానికి గానూ... సచిన్ పైలెట్  ఢిల్లీ చేరుకొని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం కావడానికి రెడీ అయ్యారు. ఆయన దాదాపుగా  బిజెపిలో జాయిన్ అయినట్లే అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన దూరం అయితే మాత్రం ఇక బిజెపి కచ్చితంగా రాజస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: