ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. కరోనా యాక్టివ్ కేసులు జీరో అయినా సరే అనూహ్యంగా కరోనా కేసులు ఇప్పుడు భారీగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. సామాన్యుల నుంచి పోలీస్ అధికారుల వరకు అందరికి కూడా కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 139 మందికి కరోనా సోకినట్లు వెల్లడి అయింది. 

 

ఇక జిల్లాలో పరిక్షల సంఖ్యను కూడా భారీగా పెంచినా సరే రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం భయపెట్టే అంశం. మొత్తం కరోనా కేసుల సంఖ్య జిల్లాలో 1661కు చేరుకుంది. ఆదివారం మార్కాపురంలో 34 కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రం ఒంగోలులో 21 మందికి కరోనా  వచ్చింది. 24 మంది కరోనాతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: