ఏ మాటకు ఆ మాట ఈ ఏడాది బాలీవుడ్ కి మాత్రం చాలా కష్టంగానే ఉంది. నలుగురు నటులు ఒక డాన్స్ మాస్టర్ ఇలా  దాదాపు 6 నుంచి 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఒక పక్క కరోనా మరో పక్క క్యాన్సర్ సహా ఇతర సమస్యలు బాగానే వేధిస్తున్నాయి అనే చెప్పాలి. తాజాగా మరో నటి క్యాన్సర్ తో మరణించడంతో బాలీవుడ్ ప్రపంచం విషాదం లోకి వెళ్ళింది. 

 

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్సే కేన్సర్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ‘హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో మంచి నటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై  పలువురు సినీ నటులు స్పందిస్తూ ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. ఆమె సుధీర్గ కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: