భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. 9 లక్షలకు చేరువలో ఉన్నాయి కరోనా కేసులు. దాదాపు 30 వేల కేసులు ప్రతీ రోజు కూడా నమోదు అయ్యే వాతావరణం కనపడుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 28,701 కొత్త కరోనా కేసులు & 500 మరణాలు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. 

 

దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,254 వద్ద ఉన్నాయి. వీటిలో 3,01,609 క్రియాశీల కేసులు ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి 5,53,471 మంది పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. 23,174 మంది దేశ వ్యాప్తంగా కారోనా బారిన పడిప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: