జమ్మూ కాశ్మీర్ లో వరుస ఎన్కౌంటర్ లు జరుగుతున్నాయి. సరిహద్దుల నుంచి వచ్చే ఉగ్రవాదులతో పాటుగా స్థానికంగా ఉండే ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడ భద్రతా బలగాలకు పెద్ద తల నొప్పిగా మారిపోయారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ జరుగుతుంది. 

 

నిన్న ఎన్కౌంటర్ జరగగా ఒక ఉగ్రవాదిని భారత బలగాలు కాల్చి చంపాయి. తాజాగా  అనంతనాగ్‌లోని శ్రీగుఫ్వరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పోలీసులు, భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి అని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉన్నారు అనే పక్కా సమాచారం అందుకున్న బలగాలు గాలింపు చర్యలు మొదలు పెట్టగా... ఉగ్రవాదులు తారస పడినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ కి గాయాలు అయ్యాయి అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: