తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులను కరోనా చాలా బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. పాపం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే నాయకులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ప్రాణాలు కూడా కోల్పోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణా కాంగ్రెస్ నేత నరేంద్ర యాదవ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 

 

ఆయన ఇటీవల కరోనా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనగా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు. అయినా సరే ఆయన కరోనా నుంచి కోలుకోలేదు. ఇటీవల ఆయన గాంధీ భవన్ లో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనగా అక్కడికి వచ్చిన నేతలు కూడా ఆందోళనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: