రాజస్థాన్ లో ఎలా అయినా సరే ప్రభుత్వాన్ని కూల్చడానికి గానూ  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అన్ని  విధాలుగా సిద్దపడుతుంది. సిఎం పై ఆదాయపు పన్ను శాఖతో దాడులు చేయిస్తుంది కేంద్రం... ఈ ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

అశోక్ గెహ్లాట్ దగ్గర  ఉండే పిఏ మీద 250 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 30 మందితో బిజెపిలో చేరే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: