ప్రపంచం మొత్తం ఓ వైపు.. మేము మాత్రం మరోవైపు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. గత ఏడాది నుంచి వరుసగా భారత సైన్యంపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. గత ఏడాది పుల్వామా దాడిలో మన సైనికులు 40 మంది అమరులయ్యారు. దానికి ప్రతిదాడిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకుపడింది. అయినా ఏమాత్రం బుద్ది రానీ ఉగ్రమూఖలు ప్రతిసారి సైన్యంపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
తాజాగా సోమవారం ఉదయం ఉగ్రవాదులు, కశ్మీర్ భద్రతాదళాల మధ్య అనంతనాగ్లో జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ దాడుల్లో పరస్పర కాల్పులు జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా ఈ కాల్పలు అనంతనాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టుగా తెలిపారు. పొద్దున్నే కాల్పులు ప్రారంభం కావడంతో ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.