సికింద్రాబాద్ మహంకాళి జాతరలో కీలక ఘట్టం జరుగుతుంది. స్వర్ణ లతా భవిష్య వాణి వినిపిస్తున్నారు. ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు అని ఆమె చెప్పారు. కరోనా కట్టడి చేసేందుకు నేను ఉన్నా అంటూ ఆమె చెప్పడం విశేషం. నాకు సంతోషం లేదని, నా ప్రజలు ఈ స్థితిలో ఉండటం చూసి వేదనకు గురవుతున్నా అని ఆమె చెప్పారు. 

 

తన ప్రజలను అందరిని కాపాడతా అని ఆమె చెప్పారు. భవిష్యత్తు లో కష్టాలు తప్పవు అని ఆమె హెచ్చరించారు. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని  స్వర్ణ లతా హెచ్చరించారు. మీరందరూ జాగ్రత్తగా ఉంటేనే మనుగడ అని పేర్కొన్నారు. ఐదు వారాలు సాకాలు చేసి యజ్ఞాలు జరపాలని పేర్కొన్నారు. భక్తి భావం తో కొలిస్తేనే తాను కాపాడతా అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: