గత కొన్నాళ్ళు గా కాపు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్ణయం తీసుకున్నారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన బాధ పడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 

 

కాపు బీసీ రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని ముద్రగడ నిర్ణయం తీసుకున్నారు.  సోషల్ మీడియాలో తనపై దాడి జరుగుతుందని ముద్రగడ మనస్తాపం చెందారు. కాపు సోదరులకు తన వేదనను తెలియజేస్తూ లేఖ రాసిన ముద్రగడ.  తనపై దుష్ప్రచారం చేసే కాపు నేతలే బీసీ రిజర్వేషన్ సాధించాలని కోరారు ఆయన. కాగా కాపులను బీసీల్లో చేర్చాలి అంటూ ఆయన గత అయిదేళ్ళు గా కాస్త ఎక్కువగా ఉద్యమం చేస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వం ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: