పబ్ జీ అనేది ఈ రోజుల్లో పిల్లలకు ఒక పిచ్చిలా మారిపోయింది. అది లేకపోతే చాలా మంది బాధ పడటం ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒక ఘటన చోటు చేసుకుంది. పలమనేరు శ్రీనగర్ కాలనీలో పబ్‌జీ గేమ్ ఆడొద్దని శ్యాం ప్రసాద్ అనే ఒక బాలుడ్ని హెచ్చరించారు. 

 

అతను ప్రతీ రోజు కూడా దానికి బానిస అయిపోయాడు. ఈ తరుణంలో ఆడవద్దు అని చెప్పగా బాధ పడిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎవరు లేని సమయ౦లో అతను ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గమనించి ఆస్పత్రికి తరలించినా సరే లాభం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: