భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మరోసారి రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,701 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఒక్కరోజే 500 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,74,254కు చేరింది. మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. 
 
దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. దేశంలో 5,53,471 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: