పచ్చని ప్రభుత్వాల్లో బిజెపి చిచ్చు పెడుతుంది అనే ఆరోపణలు ఈ మధ్య కాలం మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం.   కర్ణాటకలో పచ్చగా ఉన్న  జెడిఎస్ + కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్లాన్ చేస్తుంద‌న్న విమ‌ర్శ‌లు జాతీయ రాజ‌కీయాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు, కాంగ్రెస్ సంకీర్ణ ప్ర‌భుత్వాలు కూల్చిన బీజేపీకి ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చడం అంత ఈజీ కాదని అంటున్నారు. 

 

అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఆయనకు సౌమ్యుడి గా కూడా గుర్తింపు ఉంది. అందుకే ఆయన ప్రభుత్వాన్ని కాపాడటానికి సోనియా, రాహుల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. మ‌రోవైపు స‌చిన్ పైలెట్ త‌న‌కు సీఎం కావాల‌ని అడుగుతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా సోనియా, రాహుల్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోగలరు అని... అవసరం అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరిని టెన్ జన పథ్‌ కి పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: