మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోమారు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఏపీ సర్కార్ పై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం తమకు అండగా ఉంటుందనే నమ్మకం ప్రజలకు కలగడం లేదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెరుగుతోందని పేర్కొన్నారు. 
 
జగన్ సర్కార్ కరోనా రోగుల కోసం, క్వారంటైన్ కేంద్రాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు లెక్కల్లో చెబుతోందని అయినా పరిస్థితులు ఇంత దారుణంగా ఎందుకు ఉన్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి? అని ప్రశ్నించారు. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: