జగన్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పేరుతో తమ పార్టీ పేరును దెబ్బతీస్తున్నారు అంటూ అన్నా వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా  గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహబూబ్బాషా పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు... జగన్ పార్టీకి నోటీసులు జారీ చేసింది. 

 


 దీనిపై విచారణ జరపాలి అంటూ ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. కాగా ప్రస్తుతం జగన్ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అధికారికంగా ఉపయోగిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు మహబూబ్ బాషా హైకోర్టును ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: