ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్  వైరస్ సంక్షోభంలో తన పెద్ద మనసును చాటుకుంటూ ఎంతో మందికి చేయూతనిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా తో  చితికిపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ముందుకు వచ్చారు. అయితే వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకునే సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా  తాజాగా అధికారుల సహాయంతో ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల సమాచారం బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు సోనూసుద్. 

 

 స్వస్థలానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన 400 వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తాను  అంటూ సోనుసూద్ ప్రకటించారు. దీంతో సోనూసూద్  పై ప్రశంసల వర్షం కురుస్తోంది అనే చెప్పాలి. సంక్షోభం సమయంలో వలస కార్మికుల విషయంలో దేవుడు గా మారిపోయాడు సోనుసూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: