ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత సొంత నియోజకవర్గంలో చేపల చెరువు  వేలం  వివాదాస్పదంగా మారిపోయింది. ఒకసారి వేలంపాట పూర్తయిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల ఒత్తిడితో మరోసారి వేలంపాట నిర్వహించారు. దీంతో ముందు వేలంపాట దక్కించుకున్న పాటదారులు.. తమ పాట ఎందుకు రద్దు చేశారు అంటూ నిలదీయడంతో అధికార పార్టీకి చెందిన వర్గం.. మొదటి వేలంపాట దారులైన సుబ్రహ్మణ్యం దంపతుల పై దాడికి యత్నించినట్లు  సమాచారం. 

 

 దీంతో అధికారులు ఆశ్రయించిన మొదటి పాటదారులు తమకు న్యాయం చేయాలంటూ కోరారు.ఈ ఘటన  హోమ్ మంత్రి సుచరిత నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం లోని కోవెలమూడి గ్రామంలో చోటు చేసుకుంది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: