ఈ మధ్యకాలంలో సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా భారత బలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి . అనంతనాగ్  జిల్లా శ్రీగుప్వారా  ప్రాంతంలో ఉగ్రవాదులకు ఉన్నారన్న సమాచారంతో భారత భద్రతా దళాలు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. 

 


 వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు అని తెలిపారు జమ్మూ డీజీపీ . వీరిలో ఒకరూ  స్థానికురూ  కాగా ఒకరు పాకిస్థాన్కు చెందిన వారిగా గుర్తించారు బలగాలు. అంతే కాకుండా వీరి వద్ద భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: