ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. 
 
కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ప్రధానంగా ఈ సమీక్షలో చర్చ జరిగింది. సీఎం జగన్ సమీక్షలో గత ప్రభుత్వం 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు చేసింది శూన్యం అని అన్నారు. 2019 జులై నుంచి రాష్ట్రంలో మినిమం స్కేల్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని అధికారులు జగన్ సూచించారు. సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్‌ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జున్‌ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: