ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నేతలు పదే పదే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. వ్యవస్థలను చంద్రబాబు నాయుడు వాడుకుంటూ ఉంటారు అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు లక్ష్యంగా ఘాటు విమర్శలు చేసారు.
వ్యవస్థ ఏదైనా అందులోకి ముందుగా తన వాళ్లను చొప్పించడం. తనకు అనుకూలంగా దాన్ని నాశనం చెయ్యడం. నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం. ఇప్పుడా టక్కు ఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అర్థమైందని ఆయన చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేసారు సోషల్ మీడియాలో.
వ్యవస్థ ఏదైనా అందులోకి ముందుగా తనవాళ్లను చొప్పించడం.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 13, 2020
తనకు అనుకూలంగా దాన్ని నాశనం చెయ్యడం.
నిత్యం అనుకూల పత్రికలు, టీవీల్లో కనిపిస్తూ ఏదో పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం.
ఇప్పుడా టక్కుఠమారాలన్నీ జనానికి తెలిసిపోయాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా అర్థమైంది.