ఏపీలో యేడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి ప‌నులు చేస్తోన్న సీఎం జ‌గ‌న్ ఈ యేడాది కాలంలో తాను ఇచ్చిన హామీల‌తో పాటు ఇవ్వ‌ని మ‌రో 40 హామీల‌ను కూడా నెర‌వేర్చారు. ఇక అభివృద్ధి క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రో అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది. ఏపీలో ఇప్ప‌టికే ఉన్న వైద్య క‌ళాశాల‌ల‌కు తోడుగా మ‌రో 16 కొత్త వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే విప‌క్ష టీడీపీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నేరుగా సీఎం జ‌గ‌న్‌కు సంచ‌ల‌న లేఖ రాశారు.

 

సాధార‌ణంగా ఏ విష‌యంలో అయినా మౌనంగానే ఉండే బాల‌య్య ఈ సారి మాత్రం త‌మ హిందూపురంలో మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఏ టీడీపీ ఎమ్మెల్యే కూడా జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం త‌ప్పా విన‌తులు ఇవ్వ‌డం లేదు. ఇలాంటి టైంలో బాల‌య్య నేరుగానే జ‌గ‌న్‌కు లేఖ రాసి సంచ‌ల‌నం సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: