ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి రాజకీయ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్ట్ కి సంబంధించి అధికార పక్షాల మధ్య మాటల తూటాలు పదే పదే పేలుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 22 మంది ఎంపీలుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు ఢిల్లీ నుండి తెచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి మీరు పూర్తి చేస్తాననేది చంద్రబాబు నాయుడు 70% కట్టిన పోలవరం ప్రాజెక్టా? లేదా మీ మంత్రి చెప్పిన 20% ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానని నేడు 6 లక్షలంటూ మాట తప్పారు! మడమ తిప్పారు! అవును కదా వైఎస్ జగన్ గారూ అంటూ ట్వీట్ చేసారు.
22మంది ఎంపీలుండి @JaiTDP ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులు డిల్లీనుండి తెచ్చారా? @VSReddy_MP మీరు పూర్తిచేస్తాననేది @ncbn 70%కట్టిన పోలవరంప్రాజెక్టా? లేదా మీమంత్రి చెప్పిన 20%ప్రాజెక్టా? నిర్వాసితులకు10లక్షల పరిహారంఇస్తానని నేడు 6లక్షలంటూ మాటతప్పారు!మడమతిప్పారు!అవునుకదా @ysjagan గారు pic.twitter.com/jOPrkOPLvb
— devineni Uma (@DevineniUma) July 13, 2020