రాజస్థాన్ లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశాలే దాదాపుగా కనపడుతున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ కి 102 మంది సభ్యుల బలం ఉంది అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ రాష్ట్ర సిఎం కూడా అదే మాట చెప్తున్నారు. ఇక సచిన్ తో మాట్లాడటానికి గానూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగారు అని వార్తలు వస్తున్నాయి. 

 

సచిన్ కు ఆమెకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే నేరుగా ఆమెను రంగంలోకి దించారు అనే వార్తలు వస్తున్నాయి. ఆమె  ఇప్పటికే సచిన్ తో పలుమార్లు ఫోన్ లో మాట్లాడారు అని కూడా సమాచారం. సిఎం పదవి కాస్త ఆలస్యం అవుతుంది అని ఆమె చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: