రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు మూడు రోజుల పాటు విస్తరణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, ఏపీలో బలంగా నైరుతి రుతుపవనాలు ఉన్నాయని చెప్పింది. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది అని అంచనా వేస్తుంది.
అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావారణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పింది. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో కాసేపటి క్రితం భారీ వర్షం కురిసింది. కుండపోత వాన తో రహదారులు జలమయం అయ్యాయి.