హిందూమత విశ్వాసాలకు వ్యతిరేకంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపణలు చేసారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నేతల కబ్జాలను త్వరలో బయటపెడతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

రానున్న కాలంలో వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, పార్టీకి ప్రజలు మంచి సమాధానం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసారు. త్వరలో మళ్లీ వరంగల్‌కు వెళతానని ఏం చేస్తారో చేసుకోమని ఆయన సవాల్ చేసారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయాన్ తీవ్ర ఆరోపణలు చేసారు. తాను దేశంలో ఎక్కడికి అయినా సరే వెళ్తా అని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: