పెద్దపల్లి జిల్లాలో ఒక డాక్టర్ కరోనా వైరస్ బాధితుడి మృతదేహాన్ని తరలించడంపై ఇప్పుడు ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దీనిపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించి డాక్టర్ శ్రీరాం ని అభినందించారు. అందరూ భయపడిన సమయంలో డాక్టర్ రావడంపై ఆయన ప్రసంశలు కురిపించారు. డాక్టర్ శ్రీరామ్ మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారని ఆయన కొనియాడారు.
మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారని అన్నారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి అంటూ హరీష్ కీర్తించారు. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు. కాగా డాక్టర్ పై దేశ వ్యాప్తంగా ప్రసంశలు వస్తున్నాయి.
డాక్టర్ శ్రీరామ్ గారూ...
— harish rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) July 13, 2020
హృదయ పూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. pic.twitter.com/IZnisRKahG