ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. 140 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. 

 

వారి వారి కుటుంబాల్లో కూడా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక 40 మంది ప్రయాణికులు కూడా ఇప్పుడు  కరోనా బారిన పడ్డారు. దీనితో ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు జిల్లాల్లో ఇప్పుడు ఆర్టీసి సర్వీసులను కుదించే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. తెలంగాణా కర్ణాటక సహా తమిళనాడు రాష్ట్రాలకు సర్వీసులు వద్దు అని భావిస్తున్నారు అధికారులు. కర్ణాటకకు ఇప్పటికే ఆపేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: