ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణపై ఇప్పుడు అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణ విషయంలో సిఎం జగన్ సీరియస్ గా ఉన్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం పదే పదే చదువుతున్నాం. తాజాగా ఆయన మంత్రి వర్గ విస్తరణకు ముందు ఒక కీలక కార్యక్రమం మొదలు పెట్టారు అని సమాచారం. 

 

ఈ ఏడాది కాలంలో మంత్రుల పని తీరుకి సంబంధించి ఆయన నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తుంది. పనితీరు సంతృప్తికర స్థాయిలో లేని వారిని కేబినేట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. సీనియర్ మంత్రులు అయినా జూనియర్ మంత్రులు అయినా సరే ఇదే విధంగా వ్యవహరిస్తున్నారట సిఎం జగన్. దీనితో మంత్రులలో భయం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: