ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే నిన్నా నేడు ఏకంగా ప్రతీ రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 19 వేల 247 మందికి కరోనా పరిక్షలు చేయగా 1919 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 28,255 పాజిటివ్ కేసు లకు గాను 14,275 మంది డిశ్చార్జ్ కాగా 365 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,615 గా ఉందని ఏపీ సర్కార్ పేర్కొంది. ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో కరోనా బారిన పడి ఏకంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అనంతపురంలో ఆరుగురు కరోనాతో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: