ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ విద్యా శాఖ. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సెప్టెంబర్ మూడో వారానికి ఎంసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నామని  అన్నారు ఆయన. 

 

ఇప్పటికే ఏపీలో పలు రకాల పరీక్షలను వాయిదా వేయగా పది పరీక్షలను రద్దు చేసారు. కరోనా తీవ్రత నేపధ్యంలో పరిక్షలు నిర్వహిస్తే అనవసరంగా సమస్యలు వస్తాయని సామాజిక దూరం సాధ్యం కాదని ఏపీ సర్కార్ భావిస్తుంది. అందుకే పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరిక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: