ఏపీలో ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేసారు. సెప్టెంబర్ మూడో వారానికి ఏపీ ఎంసెట్ పరిక్షలు వాయిదా వేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. సిఎం జగన్ ఆదేశాల మేరకే పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అంతే కాదు డిగ్రీ పరీక్షలను కూడా వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. 

 

డిగ్రీ విద్యార్ధులను తదుపరి క్లాసులకు ప్రమోట్ చేస్తున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో నీట్ కూడా వాయిదా పడింది అని చెప్పారు. ఆన్లైన్ క్లాసుల గురించి విధివిధానాలను రూపొందించలేదు అని మంత్రి అన్నారు. విద్యార్ధులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని సురేష్ మీడియాకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: