దేశంలో మీడియా మొత్తం కూడా ప్రధాని  మోడీకి సరెండర్ అయిపోయింది అనేది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణ. అందుకే ఇప్పుడు ఆయన ఇక నుంచి సోషల్ మీడియాలో వార్తలు చదువుతారట. నేడు ఇండియన్ మీడియా ఎక్కువ భాగం ఫాసిస్ట్ ప్రయోజనాలను ప్రచారం చేయడానికే సరిపోతోందని ఆయన ఆరోపించారు. టెలివిజన్ ఛానల్స్, వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌ల ద్వారా తప్పుడు, ధ్వేషపూరిత కథనాలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

 

ఈ అబద్ధాలు దేశాన్ని ముక్కలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అందుకే దేశ ప్రజలకు నేనే వాస్తవాలను అందించాలని నిర్ణయించుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రేపటి నుంచి కరెంట్ ఎఫైర్స్, చరిత్ర, సంక్షోభాల గురించి వీడియో సందేశాల ద్వారా నా అభిప్రాయాల్ని వ్యక్త పరుస్తానని రాహుల్ తాజాగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: