విశాఖపట్నంలోని రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి అనంతరం మంటలు ఎగసిపడ్డాయి.
విశాఖపట్నం నగరాన్ని ఇండస్ట్రియల్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నగరంలోని రాంకీ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి.

 


పరిశ్రమ నుంచి పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలానికి దూరంగా నిలిచిపోయినట్లు సమాచారం. విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన విషాదం నింపిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: