విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సంభవించిన భారీ పేలుడు లో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. భారీ పేలుడు తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలోకి మూడు అంబులెన్స్ లు వెళ్ళాయి. మంటలు ఎక్కువగా ఉండటంతో ఫైర్ ఇంజన్లు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో 20 మంది కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాల నుంచి బయటపడినట్టు తెలుస్తుంది.

 

17 సార్లు పేలుడు శబ్దాలు సంభవించాయి అని తెలుస్తుంది. కలెక్టర్ వినయ్ చంద్  ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనేది పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన సమయ౦లో అసలు ఎంత మంది ఉన్నారు అనేది తెలియలేదు. ఎమ్మెల్యే అధీప్ రాజ్ అక్కడికి చేరుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: