విశాఖ పరవాడలోని ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుళ్లు సంభవించడంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఇక  ఈ కంపెనీ  పక్కనే దాదాపు పది కంపెనీలు వరకు ఉన్నాయి అని తెలుస్తుంది. వాటికి కూడా మంటలు అంటుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

 

దీనితో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ లు అక్కడికి తరలించారు. ఫైర్ ఇంజిన్స్ అక్కడ భారీగా చేరుకున్నా సరే మంటల తీవ్రత చాలా అధికంగా ఉండటంతో ఇప్పుడు మంటలను అదుపు చేసే అవకాశం లేదు అని తెలుస్తుంది. ప్రమాదంలో ఎంత మందికి గాయాలు అయ్యాయి అనేది చెప్పలేమని విశాఖ ఆర్డీవో కిషోర్ చెప్పారు. ఫైర్ ఇంజిన్ లను భారీగా తరలిస్తున్నామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: