భారత్​కు కీలకమైన జమ్ము-పఠాన్​కోట్​లోని అంతర్జాతీయ సరిహద్దును సైన్యాధిపతి జనరల్ ఎంఎం​ నరవణే సందర్శించారు. కతువా, సాంబా, జమ్ము, పఠాన్‌కోట్​తో పాటు రైజింగ్ స్టార్ కార్ప్స్​ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అక్కడి అధికారులతో సరిహద్దు భద్రతపై చర్చించారు.

 

సరిహద్దులో సైన్యం సన్నద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గత భద్రతా విషయాలను నరవణేకు లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది వివరించారు.

 

పాక్​ కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలకు అరికట్టేందుకు 'జీరో టాలరెన్స్' పాలసీని తిరిగి ప్రవేశ పెట్టే విషయంపై నరవణే అధికారులతో చర్చించారు.అలాగే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వెస్ట్రన్ కమాండ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సరిహద్దులో దళాల ధైర్య సాహసాలను ప్రశంసించారు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించే శక్తి సామర్థ్యాలు సైన్యానికి ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: