సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా భారత్​ చైనా సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి అధికారుల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనను తొలగించడానికి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.


లద్దాఖ్​లోని చుశూల్ ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొనే విధంగా ఇరుదేశాల సైనికాధికారులు తుది రోడ్ ​మ్యాప్​ను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: