సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పూర్తిస్థాయిలో శాంతియుత వాతావరణం నెలకొల్పే దిశగా భారత్ చైనా సైనికాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సైనిక ప్రతిష్టంభనను తొలగించడానికి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశాయి.
లద్దాఖ్లోని చుశూల్ ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దులో శాంతి నెలకొనే విధంగా ఇరుదేశాల సైనికాధికారులు తుది రోడ్ మ్యాప్ను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.