కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కేంద్రస్థానమైన చైనాపై ఆరోపణలు చేస్తూ.. చర్యలు చేపడుతున్న అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగింది డ్రాగన్. అమెరికాకు చెందిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వీసాలపై ఆంక్షలు విధించింది. ఇటీవల చైనా జిన్జియాంగ్​ రాష్ట్రంలోని ఓ మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని... మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో వీసాపై ఆంక్షలు విధించింది అమెరికా. ప్రతిగా చైనా ఆంక్షలు విధించడం ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.

 


అగ్రరాజ్యానికి చెందిన సెనేటర్​ మార్కో రుబియో సహా నలుగురు ఉన్నతాధికారులపై ఆంక్షలు విధించింది చైనా. దీంతో చైనా తీసుకున్న నిర్ణయాన్ని రుబియో విమర్శించారు. అయితే ఇది పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని... అమెరికా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి హక్కులు లేవని పునరుద్ఘాటించారు హువా. భవిష్యత్​లో తీసుకోబోయే నిర్ణయాలు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: