కరోనా కారణంగా క్రికెట్​కు దూరమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నారు. లాక్​డౌన్ వల్ల ఇన్నిరోజులు ఇంటికే పరిమితమైన క్రికెటర్లు ఔట్​డోర్ సెషన్స్​లో పాల్గొంటున్నారు. తాజాగా టీమ్​ఇండియా క్రికెటర్​ సురేశ్ రైనాతో కలిసి ప్రాక్టీస్​ను ఆరంభించాడు యువ క్రికెటర్ రిషభ్ పంత్. వీరిద్దరూ ఘజియాబాద్​లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్​లో ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు రైనా.

 

ఈ వీడియోలో రైనా, పంత్ ఇద్దరూ నెట్స్​లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. రైనా కొంతకాలంగా ఘజియాబాద్​ క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా పంత్ కూడా రైనాతో కలిశాడు. రాహుల్​ కీపర్​గా విజయవంతం అయ్యాక జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు పంత్. అలాగే రైనా కూడా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​ జట్టులో చోటు కోసం శ్రమిస్తున్నాడు.

 

రైనా, పంత్ ఐపీఎల్​లో రాణించి జట్టులోకి రావాలని చూస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఈ లీగ్ వాయిదా పడింది. ఏది ఏమైనా ఈ ఏడాది మాత్రం లీగ్ కచ్చితంగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. దీంతో ఆటగాళ్లు శిక్షణపై దృష్టి పెట్టారు.

 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Let’s start the day 💪 @rishabpant #feelitreelit

A post shared by suresh Raina (@sureshraina3) on

మరింత సమాచారం తెలుసుకోండి: