విశాఖలో మరోసారి భారీ ప్రమాదం జరిగింది. సాల్వెంట్ కంపెనీ లో భారీ పేలుడు సంభవించడం తో ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 5 కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది అని చెప్తున్నారు. శ్రీనివాస్ అనే కెమిస్ట్ గల్లంతు అయ్యారు అని ఆయన మరణించారు అని తెలుస్తుంది.
భారీ శబ్దాలతో రసాయన ట్యాంక్ లు పేలాయి. మంటల తీవ్రతకు ఆ ప్రాంతంలో పచ్చని చెట్లు అన్నీ కూడా మాడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత మాత్రం రావడం లేదు. ఇక స్థానికులు అయితే ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.