విశాఖ పరవాడ ఫార్మా సిటీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. వరుస ప్రమాదాలతో విశాఖ ప్రజలు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయాల్లోనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫార్మా సిటీలో జరిగిన ఈ పెలుడుకి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వైజాగ్ ఫార్మా సిటీలో పేలుడు గురించి విన్నప్పుడు షాక్ అయ్యా అంటూ ఆయన ట్వీట్ చేసారు. విజువల్స్ భయంకరంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రాంగణం లోపల నైట్ షిఫ్ట్ చేస్తున్న కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని నేను ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేసారు.
Shocked to hear about the explosion in Vizag's Pharma City. The visuals coming in look dreadful. I pray that the workers doing the night shift inside the premises come out safely. pic.twitter.com/rKqD9Ur5JT
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) July 13, 2020