దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 8,78,254కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,174కి పెరిగింది. 3,01,609 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకున్నారు. ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ కరోన సామాన్యులకే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కరోనా భారిన పడ్డారు.. కొంత మంది చనిపోయారు. ఇక బాలీవుడ్ ని కరోనా షేక్ చేస్తుంది.

 

ఇప్పటికే బ‌చ్చ‌న్ ఫ్యామిలీతో పాటు ప‌లువురు న‌టీన‌టులు క‌రోనా బారిన ప‌డ‌గా, కొంద‌రు ఇంకా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజాగా సినీ నటి రాచెల్ వైట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విష‌యాన్ని రాచెల్ త‌న సోషల్ మాద్యమం ద్వారా తెలిపింది.

 

ఈ అమ్మడు ఇమ్రాన్ హ‌ష్మీ, కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఉంగ్లీలో న‌టించి రాచెల్ ప‌లు బెంగాలీ చిత్రాల్లో నటించింది. హ‌ర్ హ‌ర్ బ్యోమ్‌కేష్‌, థాయ్ క‌ర్రీ వంటి చిత్రాల‌లో న‌టించింది. ప్రస్తుతం తాను  హోం క్వారంటైన్‌లో ఉంటుంది. త‌ను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల‌ని ప్రార్ధించ‌మ‌ని కోరింది రాచెల్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: