దేశ వ్యాప్తంగా కరోనా కేసులు  ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి దాదాపు 30 వేల కేసులు నమోదు అవుతూ కరోనా కంగారు  పెడుతుంది. కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకున్నా సరే లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 28,498 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఇక మరణాలు కూడా భారీగా నమోదు అయ్యాయి. 553 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 9,06,752 గా ఉన్నాయి. 3,11,565 యాక్టివ్ కేసులు దేశ వ్యాప్తంగా ఉండగా 5,71,460 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 23,727 మంది దేశ వ్యాప్తంగా మరణించారు అని కేంద్రం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: