ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కరోనా భయం వెంటాడుతుంది. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవయ్యకు కరోనా సోకింది. ఆయన గత రెండు మూడు రోజుల నుంచి అనారోగ్యంతో ఉండటంతో ఆయనకు కరోనా పరిక్షలు చేసారు. 

 

దీనితో ఆయనకు కరోనా ఉంది అని వెల్లడి అయింది. ఇక ఆయన వెంటనే చెన్నై అపోలో ఆస్పత్రికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేవు అని కాని కరోనా వచ్చింది అని అధికారులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని తెలుస్తుంది. ఫ్యామిలీ మొత్తం హోం క్వారంటైన్ కి వెళ్ళగా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై సిఎం జగన్ ఆరా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: