ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు ఈ కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది.  దీనితో ఆదాయ మార్గాలపై సిఎం జగన్ తర్జన భర్జన పడుతున్నారు. నేడు సిఎం జగన్ ఆర్థికశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

 

నేడు ఉదయం 11 గంటలకు ఆయన తన క్యాంపు ఆఫీస్ లో దీనికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు అని ప్రబ్భుత్వ వర్గాలు చెప్పాయి. అదే విధంగా మూడు గంటలకు ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ళ నానీ తో కూడా సిఎం జగన్ సమావేశం కానున్నారు. ఆర్ధిక శాఖకు సంబంధించి సిఎం జగన్ ఇప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: