రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నానా రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది.  ప్రతీ గంటా కూడా అక్కడ రాజకీయం ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది.  సిఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి గానూ కాంగ్రెస్ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు సచిన్ పైలెట్ తో చర్చలు జరుపుతుంది. 

 

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అహ్మద్ పటేల్, పి. చిదంబరం, కెసి వేణుగోపాల్ సచిన్ పైలట్‌తో పలుసార్లు మాట్లాడారు, కాని ఆయన ఈ రోజు సిఎల్‌పి సమావేశానికి హాజరయ్యే అవకాశం తక్కువ అని తాజాగా జాతీయ మీడియా వెల్లడించింది. వారు అందరితో సచిన్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా సరే సచిన్ వెనక్కు తగ్గడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: